కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి పైకప్పు మొత్తం ఎగిరి పోయిందని వార్డెన్ రాజేశ్వరి సోమవారం ఉదయం తెలిపారు. తనతో పాటు అక్కడే ఉన్న 20 మంది విద్యార్థులు వేరే భవనంలోకి పరుగులు తీశామన్నారు.