కొయ్యూరు మండలంలోని చీడిపాలెం జంక్షన్ 173. 5 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ పీ. కిషోర్ వర్మ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి మంగళవారం చీడిపాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారు ద్విచక్రవాహనంపై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందన్నారు. గంజాయితోపాటు వాహనాలను స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమన్నారు.