ఈ నెల 19 నుండి 28 వరకు పదవ తరగతి, ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సప్లిమెంటరీ జరుగుతాయని, పరీక్షలకు హాజరు కానున్న విద్యార్ధులు కష్టపడి చదివి ఉత్తీర్ణులు కావాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవార౦ సాయంత్రం కలెక్టర్ చాంబర్ లో వేసవి సెలవులలో ఐదారు తరగతుల విద్యార్ధుల కోసం కమాల్ క్యాంపులు పేరిట ప్రధమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిభిరాలు నిర్వహిస్తున్నట్లు, వాటిని ఐదారు తరగతుల విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.