పాడేరు, పెదబయలు మండలాల సరిహద్దు గుత్తులపుట్టు ప్రాంతంలో 362 కిలోల గంజాయిని పట్టుకున్నామని, దానిని రవాణా చేస్తున్న జీపును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ ఆచారి గురువారం విలేకరులకు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పెదబయలు మండల పరిధి నుంచి ఓ జీపులో మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా జరుగుతోందని అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టామన్నారు.