ప్రభుత్వ భూముల ఆక్రమణలనుపక్కాగా తొలగించాలని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి తాహశీల్దారులు, ఎంపిడిఓలతో భూ ఆక్రమణలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుకేసుల విషయంలో కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, బంజరు భూములు, నీటి వనరుల ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు.