వైఎస్సార్సీపీ నాయకుడు బొలిశెట్టి గోవింద్ను యస్ రాయవరం మండల అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త రేవుపోలవరం ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, పార్టీ నాయకులు ఎరిపల్లి జగన్నాథం, ఎరిపల్లి దేవుడు, చేపల నరహరి కృష్ణ, చెల్లూరి జగన్, చేపల రాజు తదితరులు పూలగుచ్చులతో గోవింద్కు శుభాకాంక్షలు తెలిపారు.