కైలాసపట్నంలో బాణాసంచా పేలుడులో అతి దారుణంగా ప్రమాదానికి గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల పిల్లలు బాగా చదువు కోవాలని నాన్న, చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని రాష్ట్ర హోం మంత్రి అనిత అన్నారు. బుధవారం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంగా చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన మంత్రి వారి ఆర్థిక పరిస్థితిని గమనించి మాట్లాడారు. వీరి ఉన్నత చదువుకు అయ్యే ఖర్చుకు సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని తెలిపారు.