నక్కపల్లి: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

76చూసినవారు
నక్కపల్లి: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ దుర్గ భవాని కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ ఆర్థిక సహాయం అందజేసింది. దుర్గ భవాని తల్లి చందక రాధకు భద్రత ఎక్స్ గ్రేషియా కింద రూ. 4 లక్షల చెక్కును అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్