నక్కపల్లి మండలం రాజయ్యపేట టీడీపీ గ్రామ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శుక్రవారం గ్రామంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పిక్కి గంగరాజు, ఉపాధ్యక్షుడిగా పిక్కి నూకరాజును ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్ అప్పలరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం. సోమేష్, కార్యదర్శిగాచేపల రామకృష్ణ ఎన్నికయ్యారు.