కోటఉరట్ల మండలం పొందూరు గ్రామంలో మంగళవారం ఇందేసమ్మ తల్లి పండగ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో గ్రామం నుండి తరలివచ్చారు. మాజీ సర్పంచ్ టీ. నారాయణరావు మాట్లాడుతూ గ్రామంలో పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.