పాయకరావుపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గం ప్రత్యేక అధికారి శచీదేవి విజన్-2047పై వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఐదేళ్లలో ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందో అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారి రాజశేఖర్, ఎంపీడీవో జయప్రకాశరావు పాల్గొన్నారు.