జమ్ముకాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం ఇంచార్జి కంబాల జోగులు శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు కంబాల జోగులు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు.