పాయకరావు పేట మేజర్ పంచాయతీలో విద్యుద్దీపాల నిర్వహణ అస్త వ్యస్తంగా ఉంది. గౌతమ్ థియేటర్, తాండవ వంతెన ప్రధాన రహదారి కూడలిలో కొద్దిరోజులుగా విద్యుత్తు దీపాలు వెలగకపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటి గా ఉంది. దుకాణాల్లో పని చేసే మహిళలు రాత్రి వేళ ఇంటికి వెళ్లే సమయంలో భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు విద్యుద్దీపాలు ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు.