అనకాపల్లి: రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి

50చూసినవారు
అనకాపల్లి: రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగిన రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి మోహన్రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది ఆన్ లైన్ లో ఉన్న రైతుల సమాచారాన్ని తనిఖీ చేసి అర్హులైన వారి జాబితాను రూపొందించారని అన్నారు. వ్యవసాయం చేస్తున్న చిన్న సన్న కారు మధ్యస్థ రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈనెల 20వ తేదీ లోగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్