అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ను తుని నియోజకవర్గం టీడీపీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా పార్టీ అధిష్టాన వర్గం నియమించింది. శుక్రవారం తునిలో టీడీప పోలిట్ బ్యూరో సభ్యడు రామకృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికల ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే దివ్య పాల్గొన్నారు.