అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ పీలా గోవిందు స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలో సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి శుక్రవారం కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు.