అనంతగిరి మండలంలోని పైనంపాడు పరిసర ప్రాంతంలో భారీ వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం సాయంత్ర సమయంలో కురిసిన వర్షంతో ఉపశమనం లభించింది. అయితే కురిసిన భారీ వర్షంతో ఆయా పనులకు వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలకరి విత్తనాలు కూరగాయల విత్తనాలు వేసేందుకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని ఆయా గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.