నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పాయకరావుపేట నుంచి నక్కపల్లి వైపు వెళుతున్న ఆటో యూటర్న్ తీసుకుంటుండగా బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.