నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో విచ్చలవిడిగా జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. లేటరైట్ తవ్వకాల వల్ల గిరిజనుల జీవనోపాధి దెబ్బ తింటుందన్నారు. సాగునీటికి తాగు నీటికి కొరత ఏర్పడుతుందన్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. లేటరైట్ తవ్వకాల లీజను రద్దు చేయాలన్నారు.