నాతవరం: 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

57చూసినవారు
నాతవరం మండలం సరుగుడు గ్రామంలో ఆశా , అంగన్‌వాడీ, విఆర్‌ఎలతో సిఐటియు నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ కింద మార్చి వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నిస్తుందన్నారు. వీటికి వ్యతిరేకంగా ఈనెల 20వ తారీఖున దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్