పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గుడికి వెళ్లిన ఓ మహిళ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎస్సై నేతృత్వంలో పోలీసులు గాలింపు చేపట్టి ఆమెను గుర్తించారు. సోమవారం ఆమెను కుటుంబానికి క్షేమంగా అప్పగించారు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులను సీపీ అభినందించారు.