టీడీపీ గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని పెందుర్తి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సబ్బవరంలో మండల టిడిపి కమిటీ సమావేశం నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.