రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి పిహెచ్సి పరిధి కొమరంపురంలో ఆశా కార్యకర్త బాలమ్మ శుక్రవారం గర్భిణీలు బాలింతలకు కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించారు. కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించడంలో ఆశాలు అనుసరించాల్సిన అంశాల గురించి పలు సూచనలు చేశారు. గర్భిణీలు నమోదైన దగ్గర నుంచి, ప్రసవం అయ్యే వరకు, వారి ఆరోగ్య పరిస్థితులపై కిల్కారి మొబైల్ ఆడియో సందేశం ద్వారా వినిపించారు. ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.