అధిక వర్షాలు దృష్ట్యా విశాఖలోని కొండవాలు ప్రాంతాలపట్ల అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి బి. సురేష్ కుమార్ లతో కలసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.