రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని విశాఖ నగరమేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ పరిధిలోని దక్షిణ నియోజక వర్గంలో సుమారు రూ3. 58 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.