అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో విశాఖ బీజేపీ కార్యాలయంలో శనివారం స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులు భేటీ అయ్యారు. తమ విలువైన భూములు కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రెడ్డి నరసింహారావు, పలువులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.