విశాఖ నగర పరిశుభ్రతకు, సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ యంత్రాన్ని స్వయంగా నడిపి, వాటి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో సుందరమైన విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.