విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పూర్ణామార్కెట్ సమీపంలోని ఇసుకకొండ పై ఉన్న శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. వంద రోజులకుగాను 5, 88, 077 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష ఆదేశాలు మేరకు అల్లిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో రమాభాయి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు.