తెలుగు అకాడమీ ఛైర్పర్సన్గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి గతంలో కేటాయించిన విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. కిశోర్బాబు శుక్రవారం తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు.