విశాఖ స్టీల్ ప్లాంట్లో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డబుల్ ఆర్ఎం బస్టాప్ వద్ద బైక్, సీఐఎస్ఎఫ్ కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో వడ్లపూడి నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిని స్టీల్ ప్లాంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.