విశాఖ జిల్లా పెందుర్తిలోని శంకర్ ఫౌండేషన్ మార్చి 9 నుండి 15 వరకు గ్లకోమా వారోత్సవాన్ని నిర్వహించింది. గ్లాకోమా కారణాలు నివారణ, ప్రభావంపై దృష్టి సారించి ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలో భాగంగా, నాయుడుతోటలోని ప్రధాన ఆసుపత్రి నుండి వేపగుంట జంక్షన్ వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు.