విద్యార్థులకు జగన్ చేసింది శూన్యమని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండిబాబ్జి విమర్శించారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం తీర్చుతుందని అన్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రక్రియను వైసీపీ అస్తవ్యస్తం చేసిందని, 10 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు.