విశాఖ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శనివారం మురళీనగర్-మాధవధార ప్రాంతంలో శ్రీ జగన్నాథ్ బహుడ (తిరుగు) రథయాత్ర సంప్రదాయబద్ధంగా జరిగింది. మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీలోని శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ యాత్ర వర్మ కాంప్లెక్స్, ఈస్ట్ పార్క్, మురళీనగర్ జంక్షన్ మీదుగా మాధవధారలోని వీఎంఆర్డీఏ కమ్యూనిటీ హాల్ వద్ద ముగిసింది.