ఈ నెల 19 తేదీన విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పారదర్శకతగా జరపాలని వైసీపీ నేతలు విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో నాయకులు కలెక్టర్ను కలిశారు. కూటమికి బలం లేకపోయినా వైసీపీ కార్పొరేటర్లను భయపెట్టి అవిశ్వాసం నెగ్గేందుకు ప్రయత్నిస్తుందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.