ముఖ్యమంత్రి చంద్రబాబు 16న విశాఖ వస్తున్న సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం సమీక్ష చేస్తారని, అందుకే పీజీఆర్ఎస్ రద్దు చేశామన్నారు. వచ్చే వారం యథావిధిగా పీజీఆర్ఎస్ నిర్వహిస్తామన్నారు.