విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రైల్వేకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ డీఆర్ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఏర్నిమాంబా ఆలయానికి రైల్వే స్థలం కేటాయించాలని కోరారు. పాత పోస్ట్ఆఫీస్ వద్ద నిరుపయోగంగా ఉన్న కాంకేర్ కంటైనర్ లోడింగ్ స్టేషన్ను అన్ని సౌకర్యాలతో కూడిన సాటిలైట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.