విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. సింహాచలంలో చందనోత్సవం ఏర్పాట్లపై దేవదాయశాఖ, జిల్లా అధికారులతో ఉదయం. 11గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఇన్ ఛార్జ్ మంత్రితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొంటారు.