విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో సముద్రం ఒక్కొక్కసారి 200 మీటర్లు వరకూ లోపలికి వెళ్ళిపోయింది. దీంతో ఒక్కసారిగా రాళ్లు తేలిపోయి కనిపిస్తాయి. అయితే ఈసారి కూడా అదే జరిగింది. దాదాపు 200 మీటర్లు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులకు ఇది మంచి ఆట విడుపుగా మారిపోయింది. అయితే ఈ బీచ్ లో సముద్ర నీరు అప్పుడప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటుంది. దీంతో టూరిస్టులు కేరింతలు కొడుతున్నారు.