అదాని గంగవరం పోర్టు విఆర్‌ఎస్‌ కార్మికుల ఆందోళన

58చూసినవారు
అదాని గంగవరం పోర్టు విఆర్‌ఎస్‌ కార్మికుల ఆందోళన
విశాఖలోని అదాని గంగవరం పోర్టు విఆర్‌ఎస్‌ కార్మికులు పోర్ట్‌ గేటు ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. తొలగించిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎస్‌ తీసుకున్న కార్మికులకు రావాల్సిన బకాయిల మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని నినదించారు. రెండు గంటలపాటు గేటు ముందు ఆందోళన కొనసాగించగా ఈ నెల 20న చర్చలు ఉంటాయని, ఆ రోజు సమస్యల పరిష్కారానికి తగు నిర్ణయాలు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్