సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 11 మరియు 12వ తేదీలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
ఈనెల 11న స్వామివారి మాస జయంతి, 12వ తేదీన వైశాఖ పౌర్ణమి పూజలు నిర్వహించనున్నారు.
అదే రోజున స్వామివారికి రెండవ విడత చందనం సమర్పించనున్నారు. ఆ రెండు రోజులు ఆలయంలో రాత్రి ఆరాధనతో పాటు తిరునక్షత్రం సేవా కాలము మరియు విశేష పూజలు నిర్వహిస్తారు.