ఋషికొండ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సముద్రతీరానికి సమీపంలో రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న తాటి చెట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భీమిలి పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.