అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపటి విశాఖ పర్యటనను రద్దు చేశారు. శుక్రవారం జరిగే న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్షాప్కి ఆయన హాజరుకావాల్సి ఉంది. అలాగే 'సుపరిపాలనలో తొలి అడుగు' అనే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కూడా వాయిదా వేసింది. దీనికి మొదట 'సుపరిపాలన–స్వర్ణాంధ్రప్రదేశ్' అని పేరు పెట్టారు.