ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టిన శారదాపీఠంపై 8 వారాలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై తెలుగు శక్తి అధ్యక్షుడు బి. వి. రామ్ తహసీల్దార్ను ప్రశ్నించారు. కొందరు టీడీపీ నేతలు శారదాపీఠానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు తేల్చడానికి త్రిసభ్య కమిటీ వేయాలని కోరారు. స్వాధీనం చేసుకున్న భూములను పాత్రికేయులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.