విశాఖ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారం నెంబర్ 3పై ఉన్న గురుదేవ్ ఎక్స్ప్రెస్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.