చందనోత్సవం రోజున సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలైన ఘటనలో దేవస్థానం ఈవో కె. సుబ్బారావును సస్పెండ్ చేస్తూ రెవెన్యూ(విజిలెన్స్) డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఎలాంటి పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లరాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే పలువురు సస్పెండ్ అయ్యారు.