సింహాచలం: ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

70చూసినవారు
సింహాచలం: ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కె సుబ్బారావును సస్పెండ్ చేస్తూ రెవెన్యూ, (విజిలెన్స్) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. విజయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లరాదని పేర్కొన్నారు. మిగతా ఆరుగురికి సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చినట్లు చెబుతున్నా, ఇంకా అధికారంగా ప్రకటించలేదు.

సంబంధిత పోస్ట్