హైదరాబాద్ లోని లింగంపల్లి నుండి వైజాగ్కు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్కు మంగళవారం సాంకేతిక సమస్య ఏర్పడింది. ఇంజిన్ ఫెయిలైన కారణంగా నల్గొండ రైల్వే స్టేషన్లో రైలు గంటపాటు నిలిచిపోయింది. పరిస్థితిని సరిదిద్దేందుకు అధికారులు కొత్త ఇంజిన్ను తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.