సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కుటుంబీకులతో కలిసి విశాఖ రానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 4:45 గంటలకు ఆర్కేబీచ్కు చేరుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పాల్గొని నేవీ విన్యాసాలను వీక్షిస్తారు. రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. అలాగే మంత్రి లోకేశ్ ఆదివారం ఉదయం విశాఖ చేరుకుని ప్రధాని మోదీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షలో పాల్గొంటారు.