విశాఖ లోని పాండురంగా పురం బీచ్ రోడ్ లో గల ఏయూ యోగా విలేజ్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తామని గౌరవ డైరెక్టర్ ప్రొఫెసర్ కే. రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటలు వరకు జరుగుతుంది అని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఈ శిబిరంలో వైద్యం చేస్తారని తెలిపారు.