అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనెల 21న విశాఖలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. కాగా భద్రతా చర్యలుగా 10వేల మంది పోలీసులను మోహరించనున్నట్టు హోం మంత్రి అనిత మంగళవారం తెలిపారు. ఉదయం 5:30కి ప్రధాని యోగా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పారు. వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ ఉంచుతామని పేర్కొన్నారు.